Madhavi Latha : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి మాధవీలత ఇటీవలి కాలంలో సినిమాలతో కాకుండా రాజకీయాలకి సంబంధించిన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాధవీలత తన ఇన్స్టా పోస్ట్లో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. తెలంగాణలో వచ్చే ఐదేళ్ల తర్వాత 1 ఫుడ్ ఉండదు, 2 ఉద్యోగాలు ఉండవు, 3 మహిళలకు రక్షణ ఉండదు, 4 హిందువుల పండగలు ఉండవు, 5 శాంతి ఉండదు అని పోస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. తాను బీఆర్ఎస్కు 99 మార్కులు వేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని ‘ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్’ అంటూ ఆమె పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవీలత తన పోస్ట్లో బీజేపీ తెలంగాణలో బాగు పుంజుకుందని చెప్పారు. 2018లో ఆ పార్టీకి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. మరో 19 స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. బీజేకి ఓటు బ్యాంకు పెరిగిందని.. కాషాయ పార్టీపై నమ్మకం కూడా పెరిగిందని పేర్కొంది. తెలంగాణలో ఇది బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమని చెప్పుకొచ్చింది.
మాధవీలత ఒకప్పుడు మంచి సినిమాలు చేసింది. స్నేహితుడా, నచ్చవులే, అరవింద్ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయంటూ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలలోకి ఎక్కింది. తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా ఆమె మాత్రం తనదైన శైలిలో స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుందటుంది. ఇటీవలి కాలంలో మాధవీలత బీజేపీలో చేరింది. అయితే ఆమె పాలిటిక్స్లో అంత యాక్టివ్గా లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సంచనల పోస్ట్లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…