Maa Oori Polimera 2 on OTT : టాలీవుడ్లో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్తో సాగే సినిమాలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓ రేంజ్లో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ అవుతుండగా, అందులో ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఒకటి. నేరుగా ఓటీటీలో విడుదలై బిగ్ హిట్ అయిన ‘పొలిమేర’కు ఇది సీక్వెల్గా రూపొందింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. ఫలితంగా ఈ మూవీ కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. మా ఊరి పొలిమేర-2 సినిమా డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది.
ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు అంతకంటే 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. స్ట్రీమింగ్కు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును మా ఊరి పొలిమేర-2 దాటేసింది. ఓటీటీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పొలిమేర-2 అంటూ ఆహా ట్వీట్ చేయగా, ఇది చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. 100 మిలియన్ నిమిషాలను ఈ మూవీ దాటినట్టు పోస్టర్ రిలీజ్ చేయడం గమనర్హం. మా ఊరి పొలిమేర సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ కొట్టింది. క్షుద్రపూజలు, క్రైమ్ ఎలిమెంట్లతో థ్రిల్లర్గా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది. థియేటర్లో ఈ సినిమాని మిస్ అయిన వారు ఓటీటీలో మాత్రం మిస్ చేసుకోకుండా తప్పక చూడండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…