జబర్దస్త్ ఫేం కిరాక్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ పాయింట్ని రీఓపెన్ చేసిన విషయం తెలిసిందే.. గత ఏడాది చివర్లో కూకట్పల్లిలో ఈ కర్రీ పాయింట్ని కిరాక్ ఆర్పీ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపల్ని తెప్పించి.. ఆ జిల్లా ప్లేవర్తో చేపల పులుసుని తయారు చేయించగా, అది కూకట్పల్లి వాసులకి ఎంతో నచ్చింది. దీంతో రోజుల వ్యవధిలోనే హైదరాబాద్లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ పాయింట్ ఫేమస్ అయిపోయింది. మీడియా నుంచి కూడా అతనికి పబ్లిసిటీ లభించడంతో నెల వ్యవధిలోనే రూ. లక్షల్లో బిజినెస్ జరుగుతూ వచ్చింది.
క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవడంతో కొద్ది రోజుల పాటు మూసేసాడు. కిచెన్ కెపాసిటీని పెంచడంతో పాటు చేపల పులుసు బాగా వండే మహిళలను నెల్లూరు నుంచి కూకట్పల్లికి తీసుకొచ్చి వారితో వండిస్తున్నాడు. అయితే ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ కర్రీ బాగోలేదంటూ కొందరు పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో కిర్రాక్ ఆర్పీ స్పందిస్తూ తన చేపల పులుసు విషయంలో కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు. నేను నా కిచెన్ ను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నానని నాతో మాట్లాడిన వాళ్లంతా చేపల పులుసు రుచి బాగుందని చెప్పారని ఆర్పీ అన్నారు.
అయితే ఓర్వలేనితనం వల్ల కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని నేను వేర్వేరు రకాల చేపల పులుసును అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వంటకాల డెలివరీ జరుగుతుండటంతో కర్రీ పాయింట్ ముందు జనం తగ్గారని ఆయన అన్నారు. జబర్దస్త్ తో మంచి పేరు, ఫేమ్ తెచ్చుకున్న నటుడు కిరాక్ ఆర్పీ. ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు అనే కర్రీ పాయింట్ ని గ్రాండ్ గా లాంచ్ చేశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…