Karimnagars Most Wanted OTT : ఓటీటీలో కంటెంట్ ప్రధానంగా హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మంచి చిత్రాలని ఇటీవల డైరెక్ట్గా ఓటీటీలోకి విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ చిత్రాన్ని థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ 15 లేదా 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుందని టాక్ నడుస్తుంది.. మరి ఎందులో ఇది స్ట్రీమింగ్ కానుంది అనేదే కదా మీ డౌట్. తెలుగు ఓటీటీ ఆహాలో ఇది సందడి చేయనుంది.
ఈ చిత్రానికి బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించగా, రమేష్ ఎలిగేటి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు. కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఫస్ట్ లుక్ను శనివారం రిలీజ్ చేయగా, ఓ నలుగురు యువకులు ఖైదీ డ్రెస్లలో కనిపిస్తోన్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను డిజైన్ చేశారు.పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగాయి. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం కథ మొత్తం కరీంనగర్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని, తెలంగాణ యాస, భాషలతో ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే టాక్ నడుస్తుంది.
చిత్రంలో నలుగురు స్నేహితులు ఎలా క్రిమినల్స్గా మారారు?వారు చేసిన నేరం ఏమిటన్నది? రివేంజ్ డ్రామాతో ఈ సినిమాని ఎలా చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. కరీనంగర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీలో అమన్ సూరేపల్లితో పాటు సాయి, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరీనంగర్స్ మోస్ట్ వాంటెడ్ సినిమాకు సాహిత్య సాగర్ మ్యూజిక్ అందిస్తోండగా…అనంత్ శ్రీకర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.అమన్, సాయి హీరోలుగా నటించారు. మూవీ మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…