నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన సినిమాలు నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుదలవుతున్నాయంటే.. అది ఆయన ఫ్యాన్స్ వల్లే.. అందుకే ఆయన తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడాడు. తనని ప్రేమించే అభిమానులకు అండగా నిలుస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా క్యాన్సర్తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో అభిమాని ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నఎన్టీఆర్ వీరాభిమాని పేరు కౌశిక్. కౌశిక్ వయసు 19 ఏళ్లే. కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంత కాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి, తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నదే తమ కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంతవరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా, తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు.
తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోషసాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి… నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా… భలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత… ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి… మీ అమ్మానాన్నలను చూసుకోవాలి అని ఆకాంక్షించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…