JioTV Premium Plans : ప్రముఖ టెలికం సంచలనం రిలయన్స్ జియో.. తన అనుబంధ జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం అద్భుతమైన ‘టీవీ ప్రీమియం’ ప్లాన్లు తీసుకు వచ్చింది.ఇలాంటి ప్లాన్ తీసుకు రావడం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఒకేసారి 14 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాడుకోవచ్చు.మూడు ‘జియో టీవీ ప్రీమియం ప్లాన్ ల విషయానికి వస్తే.. ధర రూ. 398, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్లుగా ఉన్నాయిఇ. ఈ ప్లాన్లు వేర్వేరు వాలిడిటీలతో వస్తాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ప్లాన్ని ఎంచుకోవచ్చు. 28 రోజులు, 84 రోజులు, ఏడాది గడువునకు వేర్వేరు ప్లాన్లు ప్రకటించింది. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి.
జియో టీవీ ప్రీమియం ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే… జియో సినిమా ప్రీమియం, డిస్నీప్లస్ హాట్స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యుబే, సన్నెక్స్ట్, హొయ్చొయ్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఎపిక్వన్ వంటి 14 ఓటీటీ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. రూ. 398 ప్లాన్లో 12 ఓటీటీ యాప్ల ఉచిత సబ్స్క్రిప్షన్ పొందుతారు. రూ. 1,198, రూ. 4,498 ప్లాన్లతో 14 ఓటీటీ యాప్ల ఉచిత సబ్స్క్రిప్షన్ లభించనుంది. రూ.398 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.1,198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగానూ, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.4,498గా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ప్లాన్లో కస్టమర్లు రోజుకు 2 జీబీ డేటాను కూడా పొందుతారు. 100 ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తాయి.
జియోటీవీ ప్రీమియం ప్లాన్లతో రీఛార్జ్ చేయడం ద్వారా అనేక విభిన్న ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేసే అవసరం ఇక ఉండదు. జియో టీవీ యాప్కి సైన్ ఇన్ చేయడం ద్వారా, ఓటీటీ యాప్స్ కోసం ప్రత్యేక లాగిన్లు, పాస్వర్డ్లను సృష్టించడం, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఒకే చోట నుంచి విభిన్న యాప్ల కంటెంట్ను వీక్షించే ఛాన్స్ ఉంటుంది. రూ. 4,498 ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు సింగిల్ క్లిక్ కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ప్లాన్ చెల్లింపును ఈఎంఐ ద్వారా కూడా చేయవచ్చు. జియో యూజర్లకు ఇప్పటికే జియో టీవీ, జియో సినిమాలాంటి ఆ సంస్థకు చెందిన యాప్స్ ఫ్రీయాక్సెస్ ఉండగా.. తాజా ప్లాన్స్ ప్రముఖ ఓటీటీల సబ్స్క్రిప్షన్లు కూడా అందిస్తుండడం విశేషం.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…