Jathara Movie : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేక విభిన్నమైన మూవీలను చేశారు. ముఖ్యంగా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇక అప్పట్లోనే జాతర అనే సినిమాను 1979లో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు సలహా ఇచ్చినా సరే చిరుతో జాతర తీశామని నిర్మాత రాజు చెప్పారు.
ఇప్పటికీ చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నత స్థానంలో ఉన్నా సరే.. ఆప్యాయంగా పలకరిస్తుంటారని.. ఇది తమ భాగ్యంగా భావిస్తామని రాజు చెప్పారు. నేను పుట్టిన ఊళ్ళోనే తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో 45 రోజులు షూటింగ్ చేశామని ఓ ఇంటర్యూలో నిర్మాత రాజు తెలిపారు. హీరో బ్రదర్ గా శ్రీధర్, విలన్ గా నాగభూషణం చేశారు. అందరూ కూడా సఖినేటిపల్లి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు.
సినిమా ఆర్థికంగా లాభం తీసుకు రాకపోయినా మంచి పేరు తెచ్చింది. అందరూ జాతర రాజు గారు అని నిర్మాతను పిలిచేవారట. నరసాపురం వరకూ రైలులో వచ్చి అక్కడనుంచి పడవల మీద సఖినేటిపల్లి చేరుకొని బంధువుల ఇళ్లల్లోనే అందరినీ ఉంచి షూటింగ్ చేశారు. ఆ సినిమాకు చిరంజీవికి 10వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రివ్యూ చూసిన మాదాల రంగారావు.. నవతరం కదిలింది మూవీకి డైరెక్టర్ గా ధవళ సత్యంను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే చిరంజీవి ఇప్పుడంటే కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు ఆయన ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే.. ఎవరైనా సరే షాక్కు గురవుతారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…