Barley Seeds : ప్రస్తుత తరుణంలో చాలా మంది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. వాటిల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ కిడ్నీ స్టోన్లు ఉన్నవారు తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం అయి కిడ్నీలు చెడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను వాడుతూనే మరోవైపు పలు చిట్కాలను పాటించాలి. దీంతో స్టోన్స్ త్వరగా కరిగిపోతాయి. ఇక కిడ్నీ స్టోన్స్ను కరిగించేందుకు బార్లీ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
బార్లీ నీళ్లు కిడ్నీలలోని రాళ్లను కరిగిస్తాయి. బార్లీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే రాళ్ళు చిన్నగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. రాళ్ళు పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ బార్లీ నీటిని తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తాగితే కిడ్నీ ఇన్ ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
బార్లీ గింజలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. చాలా చవకగా లభిస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు టీస్పూన్ల బార్లీ గింజలను రఫ్ గా గ్రైండ్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి ఈ నీటిని వడకట్టాలి. ఈ నీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి.
ఈ బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అన్నీ కరిగిపోతాయి.అంతేకాక వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే నీరసం, అలసట వంటివి లేకుండా చురుకుగా ఉంటారు. అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇలా బార్లీ నీళ్లను తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కనుక ఈ నీళ్లను రోజూ తాగాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…