Jabardasth sowmya Rao : ఒకప్పుడు బుల్లితెర కామెడీ షోకి అనసూయ, రష్మీలు పర్మినెంట్ యాంకర్స్గా ఉండే వారు. ఎప్పుడైతే అనసూయ తప్పుకుందో అప్పటి నుండి ఆమె స్థానంలో కొత్త వాళ్లు వచ్చిపోతున్నారు. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ప్రముఖ సీరియల్ యాక్టర్ సౌమ్యరావును యాంకర్ గా తీసుకొచ్చారు మల్లెమాల యూనిట్.తెలుగులో జబర్దస్త్ ను అద్భుతంగానే నడిపించింది. తనపై పంచ్లు వేసిన, ఎలాంటి కామెంట్స్ చేసిన అన్నింటిని స్వీకరించి అందరితో సరదాగా ఉండేది. అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం అందరిలో అనేక అనుమానాలు తెప్పించాయి.
అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నప్పటి నుండి ఈ భామ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.తనంతట తానే ఈ కార్యక్రమం నుంచి తప్పకుందా లేక ఆమె వెళ్లిపోవడానికి ఎవరైనా కారణమా? ఏదైనా జరిగిందా? అన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం సౌమ్య స్థానంలో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి హనుమంతు యాంకర్ గా వచ్చి చేరింది. సిరి కూడా షోని బాగానే నడిపిస్తున్నప్పటికీ ఆమె ఎందుకు వెళ్లింది అనే దానిపై మాత్రం క్లారిటీ రాకపోవడంతో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించిన సౌమ్యరావుకి ఒక నెటిజన్ నుంచి జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం వెనుక అసలు కారణం ఏంటి? అన్న ప్రశ్న ఎదురయింది..ఇక దానికి సమాధానం ఇస్తూ.. “సమయం వస్తుంది.. అప్పుడు అన్నీ చెబుతాను.. థాంక్యూ సో మచ్..” అంటూ అక్కడితో చర్చ ముగించింది. దీంతో సౌమ్యరావు జబర్దస్త్ షో కి దూరం అవ్వడం వెనుక ఏదో తతంగం జరిగింది అన్న అనుమానాలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి.. మరి సౌమ్య ఈ విషయంపై ఎప్పుడు నోరు విప్పుతుందో ?ఆ సమయం ఎప్పుడు వస్తుందో? చూడాలి.కన్నడనాట బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు తెలుగు సీరియల్స్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…