Hamsa Nandini : హీరోయిన్ హంసా నందిని షాకింగ్ న్యూస్ చెప్పారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు. తనకు వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.
హంసా నందిని తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. అందులో సుదీర్ఘమైన సందేశం ఉంది. దాంట్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తనకు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పాజిటివ్ (BRCA 1) ఉందని చెప్పారు. తనకు 70 శాతం బ్రెస్ట్, 40 శాతం అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలోనే చెప్పారని.. ఈ క్రమంలోనే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కీమోథెరపీ, లుమ్పెక్టమి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికే కీమోథెరఫీ 9 సార్లు చేయించుకున్నానని, ఇంకా 7 సార్లు చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. అయితే క్యాన్సన్ వచ్చినా తానేమీ కుంగిపోనని, తాను పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సవాల్ను తాను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి వెండితెరపై కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా హంసా నందిని వయస్సు ప్రస్తుతం 37 ఏళ్లు కాగా.. ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఈమె పూణెలో ఉంటోంది.
4 నెలల కిందట హంసా నందిని తన బ్రెస్ట్ళో చిన్న గడ్డను గుర్తించింది. అప్పుడే అనుమానం వచ్చిందని, అది క్యాన్సర్ అయి ఉంటుందని తెలిపింది. కాగా 18 ఏళ్ల కిందటే తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించింది. దీంతో వంశ పారంపర్యంగా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తనకూ ఈ వ్యాధి వచ్చిందని చెప్పింది.
అయితే తాను కొంత కాలం నుంచి సోషల్ మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటుండడంతో అందరూ తనకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారని.. తన పట్ల చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. క్యాన్సర్ అంటే తాను భయపడేది లేదని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని వివరించింది. క్యాన్సర్ను జయిస్తానన్న నమ్మకం తనకు ఉందని తెలిపింది.
కాగా హంసా నందిని 2004లో విడుదలైన ఒక్కటవుదాం అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2018లో విడుదలైన గోపీచంద్ పంతం మూవీలో ఆమె చివరిసారిగా కనిపించింది. ఆమె అనేక సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడంతోపాటు పలు ఐటమ్ సాంగ్లలోనూ నటించి మెప్పించింది. ఏది ఏమైనా హంసా నందినికి క్యాన్సర్కు అని తెలియడంతో అందరూ షాక్కు గురవుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…