Guppedantha Manasu December 20th Episode : వసుధార ప్యూన్ ని పిలిచి, శైలేంద్ర వాళ్లని మెడ పట్టుకుని బయటికి గెంటేయమని వసుధారా చెప్తుంది. తను రావడానికి భయపడుతుంటే, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని, హామీ ఇస్తున్నా అనేసరికి ముందుకు వస్తాడు. శైలేంద్ర వాడిని ఆపి వెళ్ళిపోదాం పద అంటాడు. ఇంకోసారి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలుసుకోండి అని అంటుంది. ఈ సీటుని శానిటైజర్ తో క్లీన్ చేయమని, అడ్డమైన వైరస్ లు వస్తున్నాయని చెప్తుంది. అది విని దేవయాని కోపంగా వెళ్లబోతుంటే, ఇక్కడ వసుధారా కి పట్టు ఉందని నచ్చచెప్పి తీసుకెళ్తాడు.
మహేంద్ర అనుపమ కాలేజ్ లో ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. మహేంద్ర డల్ గా ఉండడం చూసి, ఏమి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. జగతి, నేను ఇక్కడే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించేది. కాలేజ్ ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో భార్యగా, కాలేజ్ కి వచ్చాక ఫ్రెండ్ గా మాట్లాడేది. అంత గొప్ప బంధం ఉంది. కనుక తనని మర్చిపోలేక పోతున్నానని బాధపడతాడు. జగతి గురించి గొప్పగా చెబుతున్నారు. వాళ్ళందరూ అలా చెప్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది అని మహేంద్ర చెప్తాడు.
ఇన్ని రోజులు జగతి లేదు. తన చావుకి కారణం ఎవరో కనుక్కుందామని అనుకున్నాను. కానీ, ఇప్పుడు రిషి కనపడకుండా పోయాడు. కట్టుకున్న భర్త కనపడక పోయేసరికి, తల్లడిల్లి పోతోంది వసుధారా. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే వసు, రిషి విషయంలో మాత్రం ఎందుకలా భయపడుతోంది? ఏదో ఒకటి చేయాలని అనుపమ అంటుంది. వసు బాధను దూరం చేయాలనే కదా, ముకుల్ తో మాట్లాడాలని అంటాడు. ఏనాటికైనా రిషి వసు కలుస్తారు. అదే తన ఆశ అని చెప్తాడు. తల్లికి శైలేంద్ర ధైర్యం చెప్తాడు.
వసు అంతకంతకు భయపడేలా చేస్తానని మాట ఇస్తాడు. రిషి కనిపించకపోయినా, తాను భయపడలేదని, మనల్ని చూసి, అది కాస్త కూడా తొనకడం లేదని అంటుంది. మెడ పట్టుకుని గెంటేస్తే ఏం బాగుంటుంది అని అంటాడు. చివరికి అటెండర్ కి కూడా భయపడుతున్నావని దేవయాని తిడుతుంది. చూస్తూ ఉండు వసుధార మెడ పట్టుకొని బయటకి గెంటేస్తానని చెప్తాడు. మిమ్మల్ని కూడా, మెడ పట్టుకుని గెంటేస్తారని చెప్తే విన్నారా..? నేను వెళ్ళినట్లయితే ఇలా జరిగేది కాదు కదా అంటుంది.
మొత్తం విన్నావా అని అడుగుతాడు. అవును విన్నానని అమాయకంగా చూస్తుంది ధరణి. వాళ్ళకి కౌంటర్ వేసి వెళ్ళిపోతుంది. వసుధార చేసిన అవమానం కంటే, ధరణి చేస్తున్న అవమానం తట్టుకోలేకపోతున్నాను దేవయాని అంటుంది. సీటు కోసం మౌనంగా ఉంటున్నానని అంటాడు. ఇప్పుడు నేను వేసే అడుగు చాలా భయంకరంగా ఉండబోతుంది, నీ కళ్ళ ముందు ఏం జరిగినా నువ్వు భయపడకు. ధైర్యంగా వుండు అంటాడు. వసుధార నోరు మూయిస్తాను.
నేను చెప్పే మాటలు వసు నోటి నుండి అందరి ముందు పలికేలా చేస్తానని అంటాడు. కాలేజీలో బోర్డు మీటింగ్ మొదలవుతుంది. దేవయాని వస్తే, అందరూ తనకి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఫణింద్ర దేవయానని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నిన్ను ఎవరు పిలవలేదు కదా..? ఎందుకు వచ్చావు అని అంటాడు. పెద్ద మీటింగ్ అని తెలిసి వచ్చానని అంటుంది. ఇంట్లో చేస్తున్నది చాలక, కాలేజీలో కూడా మనసు పాడు చేయడానికి వచ్చావా అని, తిడతాడు. వసుధార ఇంకా రాలేదా అని అంటుంది.
బోర్డు మెంబర్స్ టైం అంతా వేస్ట్ అవుతుంది. వసుధార అసలు ఎక్కడ ఉంది? రాదా అని అడుగుతుంది. వసుధార బయలుదేరిపోతుందిగా ఒక వ్యక్తి కొరియర్ వచ్చిందని చెప్పి పార్సెల్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రిషి చేతికి గతంలో వసు పెట్టిన బ్రేస్ లేట్ ఉంటుంది. నువ్వు నీ భర్తని కలవాలి అనుకుంటే, వెంటనే నేను చెప్పిన అడ్రస్ కి ఎవరికీ చెప్పకుండా రా అని చెప్తారు. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా చెప్పినా లేట్ చేసిన నీ భర్తని నువ్వు జన్మలో చూడలేవని ఉత్తరం ఉంటుంది. ముందు ఈ అడ్రెస్ కి వెళ్లాలని, సార్ ని చూడాలని వసుధారా బయలుదేరుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…