నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ఇప్పటికే రూ.80 కోట్ల వసూళ్లను సాధించి టాప్ మూవీగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం.
అఖండ మూవీకి బాలయ్య నటన ఒక ప్లస్ పాయింట్ అయితే థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఇందులో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇక ఈ మూవీలో అనేక పాత్రలు ఆకట్టుకున్నప్పటికీ ఇందులో నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో బేబీ దేష్ట చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె నటనను అందరూ మెచ్చుకుంటున్నారు.
దేష్టను బాలకృష్ణ ముద్దు చేస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ బాలయ్య.. బేబీ దేష్ట గురించి చెప్పారు. ఆమె నటన పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
దేష్ట ఇన్స్టాగ్రామ్ ద్వారా నిర్మాతలకు కనెక్ట్ అయిందని, తరువాత బోయపాటికి పరిచయం అయిందని దేష్ట తల్లిదండ్రులు తెలిపారు. ఆమెకు డైలాగ్స్ పలకడం సరిగ్గా రాకపోయినా బోయపాటి తమ పాపతో అద్భుతంగా నటింపజేయించారని తెలిపారు. మొదటి సినిమాతోనే తమ కుమార్తెకు మంచి పేరు రావడం సంతోషంగా ఉందన్నారు. బాలకృష్ణ దేష్టతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, తమను ఆయన బాగా చూసుకున్నారని తెలిపారు.
బోయపాటి తమ పాపకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను అందరూ చూసి తమ పాప నటన ఎలా ఉందో చెప్పాలని వారు కోరారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…