Dhootha OTT : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సక్సెస్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ చైతూతో దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ వెబ్ సిరిస్ తో చాలా గ్రాండ్ గా ఓటీటీ అరంగేట్రం చేశారు చై. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరిస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారం అవుతుండగా, ఈ వెబ్ సిరీస్కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
సుమారు 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ఉన్న దూత సిరీస్ సస్పెన్స్తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ని ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వస్తుండడం చూసి యూనిట్ చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ చెప్పిన దూత ఆలోచన, కథాంశం చాలా నచ్చింది. ఈ కథకు నాగ చైతన్యే మొదటి ఎంపిక. ఆయన కూడా కథ వినగానే చేద్దామన్నారు అని అన్నారని ప్రొడ్యూసర్ శరత్ మరార్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని జూన్, జులై లోనే పూర్తి చేసి ఫైనల్ కాపీ అమేజాన్ కి ఇచ్చాం. అయితే ఇచ్చిన తర్వాత ఎన్నో భాషల్లో డబ్, సబ్ టైటిల్స్ చేసి తర్వాత విడుదల చేస్తామని వారు మాకు ముందు చెప్పారు.
ఆ ప్రక్రియ కోసం దాదాపు ఐదు నెలలు సమయం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా మాకు కొత్తగా అనిపించింది. అయితే విడుదలైన తర్వాత అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందని అన్నారు శరత్ మరార్.. లాంగ్ ఫార్మట్ స్టొరీ టెల్లింగ్ అనేది ఇండియాలో కొత్త ఫార్మాట్. కొన్ని సిరిస్ లు వచ్చినప్పటికీ ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే. ఈ క్రమంలో చేసిన ప్రాజెక్ట్ కు ప్రేక్షకులు నుంచి ఇంత మంచి స్పందన రావడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…