Curry And Cyanide OTT : థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఎంతో ఆసక్తిని చూపుతున్న విషయం తెలిసిందే. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి చిత్రం ఒకటి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.ముఖ్యంగా ఎక్కువ మంది ఎంతో ఇష్టపడే అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో తెగ సందడి చేస్తుండగా, తాజాగా ఓ అద్భుతమైన రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. అప్పట్ల కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని చాలా మంది సినిమాగా మలిచారు.
కేవలం సినిమాగానే కాకుండా డాక్యుమెంటరీగా, సీరియల్ గా కూడా రూపొందించడం మనం చూశాం. వీటికి సంబంధించి చిత్రాలు కూడా ప్రేక్షకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు డాక్యుమెంటరీ వచ్చింది. అదే జూలీ జోసెఫ్ కథ. అయితే కళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన ఆమె 14 సంవత్సరాల్లో మొత్తం ఆరు హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను అలా హత్య చేయడం… అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆమె ఆరు హత్యలకు ఎలా పాల్పడిందో తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.అన్నింటిని ఆమె అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది.
జూలీ జోసెఫ్ తన అత్తయ్యను, మామయ్యను, ఆతర్వాత ఆమె భర్త రాయ్ థామస్, ఆతర్వాత తన అత్తయ్య సోదరుడు మాథ్యూ, తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను చంపేసింది . ఆతర్వాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. అయితే జూలీ జోసెఫ్ భర్త సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీ జోసెఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కర్రీ అండ్ సైనైడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, మిస్ అయిన వారు తప్పక ఈ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…