అందం, అభినయంతో పాటు తన నాట్యంతోను ఎంతో మంది ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టిన అలనాటి నటి భానుప్రియ. నాట్యంలో కెమెరాకి సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. ఆ మధ్య కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన భానుప్రియ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటివారు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో చాలా మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన నటనతో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందగా అలాంటి వాళ్ళలో రాధిక, రాధ, విజయశాంతి , భానుప్రియ లాంటి వారు ఉన్నారు.
సినిమాల్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ వెంకటేష్ తో కె విశ్వనాథ్ గారు తీసిన స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ గా నటించి ఆ సినిమాలో తను చేసిన క్లాసికల్ డాన్స్ కి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది..ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా మొత్తం భానుప్రియ గారి పాత్ర మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పాత్రలో అలవోకగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.”మావారు చనిపోయినప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతానికి అందుకు సంబంధించి మెడిసిన్స్ తీసుకుంటున్నాను అని భానుప్రియ అన్నారు. ఇక మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుతోంది. తనకి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు అంటూ భానుప్రియ చెప్పుకొచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…