Alia Bhatt : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో, హీరోయిన్స్ని వేధించడాలు ఎక్కువయ్యాయి.సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. డీప్ ఫేక్ వీడియో అంటూ కొత్తగా హీరోయిన్స్ని వేధించడం ఎక్కువైంది. ఇటీవల రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్తో లిఫ్ట్లో వెళుతున్నట్టు రష్మికను దారుణంగా ఆ వీడియోలో చూపించార. ఆ ఘటన మరువక ముందే బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టు మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అయితే ఇది కూడా మార్ఫింగ్ వీడియో అని స్పష్టంగా అర్ధమైంది. ఆ తర్వత కత్రినా కైఫ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది.ఇక ఇప్పుడు తాజాగా మరో స్టార్ నటి డీప్ఫేక్ బారిన పడ్డారు.‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ కు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది. వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…