Aishwarya Rai : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యమైన జీవితం గడుపుతుండగా, కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఏవో చిన్న చిన్న మనస్పర్ధల వలన వారి వైవాహిక జీవితానికి మధ్యలోనే పులిస్టాప్ పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల గురించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనే పుకార్లు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. గతకొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి. అంతేకాదు ఈ రూమర్స్ పై అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారని అనుకున్నారు.
అయితే అభిషేక్ ,ఐశ్వర్య కూతురు ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుండగా, స్కూల్లో జరిగిన కార్యక్రమానికి ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్, అగస్త్య నంద హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారిద్దరు కలిసే ఉన్నారని కొందరు చెబుతున్నారు. అయితే బీటౌన్ మీడియా ప్రకారం ఐశ్వర్య రాయ్ తన అత్త జయాబచ్చన్తో గొడవ పడి ఆమె నుండి దూరంగా ఉంటుందని టాక్. ఆంగ్ల వెబ్సైట్ రాసిన దాని ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కి విడాకులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు.
కాకపోతే ఇంట్లో గొడవల కారణంగా ఆమె దూరం ఉండాలనే నిశ్చయించుకుందట.ఎందుకంటే తన కూతుర్ని ఇలాంటి గొడవల వాతావరణంలో పెంచితే తన కూతురు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిందని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కి కూడా ఐశ్వర్య కోడలుగా రావడం ఇష్టం లేదని,ఇప్పటికి కూడా తన కొడుకు మాజీ లవర్ అయినా కరిష్మా కపూర్ అంటేనే తనకి ఇష్టమని,ఏదైనా పార్టీలో కనిపిస్తే ఐశ్వరరాయ్ కంటే ఎక్కువగా కరిష్మా కపూర్ తోనే నవ్వుతూ మాట్లాడుతుందనే వార్తలు ఇప్పటికే మీడియాలో వినిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…