ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి వార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంస్థలు ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు వేరువేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 170 గ్రూప్- బీ, గ్రూప్- సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎయిర్ వింగ్ 65, పారామెడికల్ 75, వెటర్నరీ 35 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారు పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు, వయసు ఉంటుంది. ఉద్యోగానికి అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంటేషన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి జులై 26 2021 దరఖాస్తు చివరితేది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు. ఇతరులు ₹100 పరీక్ష రుసుం చెల్లించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ https://bsf.gov.in/ చూడవచ్చు.
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ 65 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్నవి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 ఉత్తీర్ణత సాధించి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకొని ఉండాలి. వీరి వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. https://recruitment.itbpolice.nic.in/ఈ దరఖాస్తు కు సెప్టెంబర్ 2 2021 ఆఖరి తేదీ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…