ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది ప్రస్తుత తరుణంలో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతోంది. అందులో భాగంగానే ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని గమనించిన చాలా మంది ఏఐలో నైపుణ్యతను సాధించి ఉద్యోగాలను పొందుతున్నారు. అయితే ప్రపంచంలోని పలు ప్రముఖ ఇనిస్టిట్యూట్లు ఏఐ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సులలో చేరడం ద్వారా నూతన మెళకువలను నేర్చుకుని ఉద్యోగావకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.
ఈ కోర్సును గూగుల్ క్లౌడ్ అందిస్తోంది. ఇది బిగినర్ లెవల్ కోర్సు. వారానికి 5 గంటలు క్లాసులు ఉంటాయి. 2 నెలల కాలవ్యవధిలో కోర్సును పూర్తి చేయాలి. అయితే ఎవరికి నచ్చినట్లు వారు షెడ్యూల్, డెడ్లైన్ పెట్టుకుని ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ కోర్సులో ఆసక్తి ఉన్న ఎవరైనా చేరవచ్చు.
Coursera అనే వెబ్సైట్ ద్వారా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. మే 17న కొత్త సెషన్లు ప్రారంభం అవుతాయి. 6-9 నెలల పాటు సమయం పడుతుంది. ఇంటర్మీడియట్ లెవల్ ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. అభ్యర్థులు 4500 డాలర్ల ఫీజు చెల్లించి కోర్సులో చేరవచ్చు.
ఐఐటీ మద్రాస్ ఈ కోర్సును అందిస్తోంది. 12 వారాల వ్యవధి ఉన్న కోర్సు ఇది. యూజీ, పీజీ విద్యార్థులు ఇందులో చేరవచ్చు. కోర్సు చివర్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాస్ కావాలంటే 12 అసైన్మెంట్లలో కనీసం 8 అసైన్మెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
హార్వార్డ్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి 12 వారాలు. వారానికి 6 నుంచి 18 గంటల క్లాసులు ఉంటాయి. కోర్సులో కొన్ని రోజుల పాటు వారానికి 10 నుంచి 30 గంటల పాటు క్లాసులను నిర్వహిస్తారు. ఎడ్ఎక్స్ లో కోర్సును అభ్యసించాల్సి ఉంటుంది. ఫీజు రూ.25,998.
ఈ కోర్సు కాల వ్యవధి 7 నెలలు. దీన్ని కోర్స్ ఎరా ద్వారా ఐబీఎం అందిస్తోంది. కోర్సును పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్ సర్టిఫికెట్, ఐబీఎం డిజిటల్ బ్యాడ్జ్ను ఇస్తారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…