ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వారిని కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిపోయిన పలు టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,193 మంది అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమం టైం స్కేల్ కింద తీసుకోవాలని ప్రభుత్వం జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు నియామకాలు చేపట్టినప్పటికీ వీరిలో కొన్ని కారణాలవల్ల 144 మంది అభ్యర్థులు విధుల్లో చేరలేదు. ఈ క్రమంలోనే మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కరణం హరికృష్ణ, సింహాచలం పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు, ఏమిటనే విషయాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…