మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం స్త్రీలు పట్టీలు ధరించడం ఒక ఆచారంగా వస్తుంది. పాప పుట్టగానే తన కాళ్లకు పట్టీలు తొడగడం ఆనవాయితీ.ఈ విధంగా చిన్నారి కాళ్లకు వెండి పట్టీలను ధరించి ఘల్లుఘల్లున మన ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తోందని భావిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత అమ్మాయిలకు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామంది కాళ్లకు వెండి పట్టీలను మాత్రమే ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరికి బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదు అనే సందేహం కలుగుతుంది. అయితే బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాము. అందుకోసమే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగులోనే బంగారం ఉంటుంది కనుక బంగారు పట్టీలను మన పాదాలకు తొడగితే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు. కనుక బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.
సైన్స్ పరంగా మన శరీరానికి బలం పాదాల నుంచి పైకి ఎగబాకుతుంది కనుక పాదాలకు వెండి పట్టీలను తొడగడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడి తగ్గిపోయి శరీరానికి చల్లదనం కల్పిస్తుంది. కానీ బంగారానికి వేడి గుణం ఉండటం వల్ల బంగారం ధరించడం వల్ల మన శరీరం వేడి చేస్తుంది.అందుకోసమే కాళ్లకు వెండి పట్టీలనే తొడగాలనీ చెబుతారు. ఇటు ఆధ్యాత్మికంగాను,ఆరోగ్య పరంగాను వెండి పట్టీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగరు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…