మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం స్త్రీలు పట్టీలు ధరించడం ఒక ఆచారంగా వస్తుంది. పాప పుట్టగానే తన కాళ్లకు పట్టీలు తొడగడం ఆనవాయితీ.ఈ విధంగా చిన్నారి కాళ్లకు వెండి పట్టీలను ధరించి ఘల్లుఘల్లున మన ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తోందని భావిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత అమ్మాయిలకు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామంది కాళ్లకు వెండి పట్టీలను మాత్రమే ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరికి బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదు అనే సందేహం కలుగుతుంది. అయితే బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాము. అందుకోసమే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగులోనే బంగారం ఉంటుంది కనుక బంగారు పట్టీలను మన పాదాలకు తొడగితే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు. కనుక బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.
సైన్స్ పరంగా మన శరీరానికి బలం పాదాల నుంచి పైకి ఎగబాకుతుంది కనుక పాదాలకు వెండి పట్టీలను తొడగడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడి తగ్గిపోయి శరీరానికి చల్లదనం కల్పిస్తుంది. కానీ బంగారానికి వేడి గుణం ఉండటం వల్ల బంగారం ధరించడం వల్ల మన శరీరం వేడి చేస్తుంది.అందుకోసమే కాళ్లకు వెండి పట్టీలనే తొడగాలనీ చెబుతారు. ఇటు ఆధ్యాత్మికంగాను,ఆరోగ్య పరంగాను వెండి పట్టీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగరు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…