ఆధ్యాత్మికం

కురుక్షేత్ర యుద్ధం ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం మహాభారతం అనగానే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తారు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవులు వందమంది చనిపోతారు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం ఎక్కడ అనేది ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరగాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. ఈ విధంగా దృతరాష్ట్రుడు ఆ స్థలంలోనే యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అను ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఒక రాజు ఎంతో మంత్రముగ్ధుడై ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయాలని తన బంగారు రథం నుంచి అక్కడ అడుగు పెట్టాడు. రథం నుంచి దిగిన రాజు నాగలిని తయారుచేసి శివుడి వాహనం నందిని యముడి వాహనం మహిషాన్ని తీసుకొని నాగలితో యుద్ధం చేయసాగాడు.ఇది చూసిన విష్ణు మూర్తి అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడగగా అందుకు రాజు వ్యవసాయం చేస్తున్నాను అని సమాధానం చెబుతాడు.

ఈ క్రమంలోనే విత్తనాలు ఎక్కడ అని విష్ణుమూర్తి అడిగితే తన శరీరంలో ఉన్నాయని చెబుతాడు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఏది చూపించు అంటూ కురు అనే రాజు తన శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నప్పటికీ ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఉండటం వల్ల మంత్ర ముగ్ధుడైన విష్ణుమూర్తి తిరిగి తన శరీరాన్ని పూర్వ రూపానికి తెచ్చి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు రాజు ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఇక్కడ మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని వరం కోరగా అందుకు విష్ణుమూర్తి తథాస్తు అని వరమిచ్చాడు.

ఇక మహాభారతం విషయానికి వస్తే ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు యుద్ధం ఏ ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు. యుద్ధంలో తన కుమారులు ఎలాగో మరణిస్తారు కనుక వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని కురుక్షేత్ర యుద్ధం ఈ ప్రాంతంలో జరగాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా ఈ కురుక్షేత్ర భూమిలో మరణించిన కౌరవులకు మరణాంతరం స్వర్గప్రాప్తి కలిగిందని చెప్పవచ్చు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన

భారత్‌, శ్రీలంకలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…

Sunday, 18 January 2026, 11:34 AM

గుండె ఆరోగ్యం కోసం అపోలో డాక్టర్ సూచన: ఈ 3 జీవనశైలి మార్పులతో హై బీపీకి చెక్ పెట్టండి!

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం హైబీపీ అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. కొంద‌రికి…

Friday, 16 January 2026, 7:16 PM

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…

Wednesday, 14 January 2026, 5:37 PM

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరుల‌కి ఆధార్ కార్డు అత్యంత…

Tuesday, 13 January 2026, 4:22 PM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM