ఆధ్యాత్మికం

కురుక్షేత్ర యుద్ధం ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం మహాభారతం అనగానే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తారు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవులు వందమంది చనిపోతారు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం ఎక్కడ అనేది ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరగాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. ఈ విధంగా దృతరాష్ట్రుడు ఆ స్థలంలోనే యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అను ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఒక రాజు ఎంతో మంత్రముగ్ధుడై ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయాలని తన బంగారు రథం నుంచి అక్కడ అడుగు పెట్టాడు. రథం నుంచి దిగిన రాజు నాగలిని తయారుచేసి శివుడి వాహనం నందిని యముడి వాహనం మహిషాన్ని తీసుకొని నాగలితో యుద్ధం చేయసాగాడు.ఇది చూసిన విష్ణు మూర్తి అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడగగా అందుకు రాజు వ్యవసాయం చేస్తున్నాను అని సమాధానం చెబుతాడు.

ఈ క్రమంలోనే విత్తనాలు ఎక్కడ అని విష్ణుమూర్తి అడిగితే తన శరీరంలో ఉన్నాయని చెబుతాడు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఏది చూపించు అంటూ కురు అనే రాజు తన శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నప్పటికీ ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఉండటం వల్ల మంత్ర ముగ్ధుడైన విష్ణుమూర్తి తిరిగి తన శరీరాన్ని పూర్వ రూపానికి తెచ్చి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు రాజు ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఇక్కడ మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని వరం కోరగా అందుకు విష్ణుమూర్తి తథాస్తు అని వరమిచ్చాడు.

ఇక మహాభారతం విషయానికి వస్తే ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు యుద్ధం ఏ ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు. యుద్ధంలో తన కుమారులు ఎలాగో మరణిస్తారు కనుక వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని కురుక్షేత్ర యుద్ధం ఈ ప్రాంతంలో జరగాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా ఈ కురుక్షేత్ర భూమిలో మరణించిన కౌరవులకు మరణాంతరం స్వర్గప్రాప్తి కలిగిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM

బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..

టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌నున్నారు. త‌న ప్రియురాలు కావ్య‌తో ఆయ‌న నిశ్చితార్థం ఆదివారం (మార్చి…

Sunday, 8 March 2026, 8:36 PM

‘సోషల్ మీడియాకు దూరం’.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు! ఫైనల్‌కు ముందు అసలు రహస్యం ఇదే.

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు తాను ఫోన్‌నే కాదు, సోష‌ల్ మీడియాను కూడా దూరంగా పెట్టాన‌ని, ఇప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల‌ను చూడ‌డం లేద‌ని…

Sunday, 8 March 2026, 5:30 PM

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

విశ్వ‌క్ సేన్‌, క‌యాదు లోహ‌ర్ హీరో హీరోయిన్లుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ…

Sunday, 8 March 2026, 3:39 PM