Triyuginarayan Temple : హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్దరు దంపతులు ఒక్కటయ్యే శుభ ముహూర్తాన దేవతలు, దేవుళ్లు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులిరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు పార్వతీ దేవి శివున్ని వివాహమాడాలని తలచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నాడట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్లయిన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్య కష్టాలు తొలగుతాయట. దీంతోపాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి.
ఈ దేవాలయంలో ఉన్న హవన్ కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మ దేవుడి సాక్షిగా పార్వతి, శివుడు ఒకటయ్యారట. ఇదే ప్రదేశాన్ని దంపతులు దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఈ శివాలయంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్రదేశంలో ఎల్లప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుందట. ఇక్కడే పార్వతీ శివులు మంట చుట్టూ 7 అడుగులు నడిచారని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి అఖండ్ ధుని ఆలయం అనే పేరు కూడా వచ్చిందట. శివాలయంలోనే ఉన్న నీటి కొలనులో శివ పార్వతుల కల్యాణం తరువాత బ్రహ్మ స్నానం చేశాడట. అందుకే ఈ కొలనుకి బ్రహ్మ కుండ్ అనే పేరు వచ్చింది. ఈ కొలనులో మునిగితే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయంలోనే ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేశాడట. ఈ క్రమంలో ఆయన పార్వతీ దేవికి సోదరుడిగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంతోపాటు శివ పార్వతుల కల్యాణం కూడా జరిపించాడట. అందుకే ఈ కొలనును విష్ణు కుండ్ అని వ్యవహరిస్తారు. దేవాలయంలో ఉన్న మరో నీటి కొలనులో శివుడు ఇతర దేవతలతో కలిసి స్నానం చేశాడట. అందుకే దీన్ని రుద్ర కుండ్ అని పిలుస్తారు. శివుడు తన వివాహానికి ముందు ఇక్కడ స్నానమాచరించాడట. అయితే ఇక్కడ స్నానం చేసే దంపతులకు సంతాన సమస్య తొలగిపోతుందని విశ్వసిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…