మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సముద్రగర్భం నుంచి బయటపడిన ఈ గవ్వలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు గవ్వలను పూజా సమయంలో ఉపయోగించి పూజలు చేస్తుంటారు. మరికొందరు వివిధ కార్యక్రమాలలో గవ్వలను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా గవ్వలకు ఎందుకంత ప్రాధాన్యత కల్పించారు, గవ్వలను లక్ష్మీ దేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. ఈ క్రమంలోనే సముద్రగర్భంలో లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదేవిధంగా గవ్వలు కూడా సముద్రగర్భం నుంచి ఏర్పడ్డాయి కనుక గవ్వలను లక్ష్మీదేవి సోదరి సోదరులుగా భావిస్తారు. అందుకోసమే లక్ష్మీదేవి స్వరూపమే గవ్వలని భావిస్తారు.
ఇక గవ్వలను మన ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గవ్వలలో కొద్దిగా పసుపు రంగులో ఉండే గవ్వలను మన ఇంట్లో డబ్బులు దాచి చోట ఉంచడం వల్ల మన ఇంట్లోకి ధన ప్రవాహం ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు పసుపుపచ్చని వస్త్రంలో గవ్వలని ఇంటి ద్వారం వద్ద కట్టడంతో ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.అదేవిధంగా పిల్లలకు నరదిష్టి తగలకుండా ఉండాలంటే మెడలో గవ్వను కడతారు. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు గవ్వలను జేబులో వేసుకుని వెళ్లడం ద్వారా ఆ పని దిగ్విజయంగా జరుగుతుందనీ పండితులు చెబుతారు.ఈ విధంగా గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాటికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…