మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సముద్రగర్భం నుంచి బయటపడిన ఈ గవ్వలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు గవ్వలను పూజా సమయంలో ఉపయోగించి పూజలు చేస్తుంటారు. మరికొందరు వివిధ కార్యక్రమాలలో గవ్వలను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా గవ్వలకు ఎందుకంత ప్రాధాన్యత కల్పించారు, గవ్వలను లక్ష్మీ దేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. ఈ క్రమంలోనే సముద్రగర్భంలో లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదేవిధంగా గవ్వలు కూడా సముద్రగర్భం నుంచి ఏర్పడ్డాయి కనుక గవ్వలను లక్ష్మీదేవి సోదరి సోదరులుగా భావిస్తారు. అందుకోసమే లక్ష్మీదేవి స్వరూపమే గవ్వలని భావిస్తారు.
ఇక గవ్వలను మన ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గవ్వలలో కొద్దిగా పసుపు రంగులో ఉండే గవ్వలను మన ఇంట్లో డబ్బులు దాచి చోట ఉంచడం వల్ల మన ఇంట్లోకి ధన ప్రవాహం ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు పసుపుపచ్చని వస్త్రంలో గవ్వలని ఇంటి ద్వారం వద్ద కట్టడంతో ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.అదేవిధంగా పిల్లలకు నరదిష్టి తగలకుండా ఉండాలంటే మెడలో గవ్వను కడతారు. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు గవ్వలను జేబులో వేసుకుని వెళ్లడం ద్వారా ఆ పని దిగ్విజయంగా జరుగుతుందనీ పండితులు చెబుతారు.ఈ విధంగా గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాటికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…