Shankham : చాలామంది ప్రశాంతంగా ఉంటుందని ఆలయాలకి వెళుతూ ఉంటారు. కొంచెం సేపు మనం ఏదైనా దేవాలయంలో గడిపితే చాలు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటుంది. తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఏదో శక్తి మనలోకి వస్తుంది. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు గమనిస్తే శంఖం ఊదుతూ ఉంటారు. ఎక్కువగా శివాలయాల్లో శంఖంని ఉంటారు. కొంతమంది అయితే ఇళ్లల్లో శంఖాన్ని పెట్టి ఊదుతూ ఉంటారు. అయితే అసలు ఎందుకు శంఖం ఊదాలి..? శంఖం ఊదితే ఎలాంటి ఫలితం ఉంటుంది.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ పురాణ ఇతిహాసాలలో శంఖానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతుడితో ఎంతో అనుబంధం ఉంది. క్షీరసాగర మధనంలో శంఖం ముందు పుట్టి ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందట. శంఖం నుండి ఓంకార శబ్దం వెలువడుతుంది. శంఖానికి నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
యుద్ధాలు వంటివి మొదలయ్యేటప్పుడు శంఖాన్ని పూరించి ఆ తర్వాత మొదలు పెడతారు. అయితే ఇలా శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. శంఖం శబ్దంతో మంచి జరుగుతుందట. శుభం జరుగుతుందట. సమస్యలు తొలగిపోతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతిరోజూ నాలుగు సార్లు శంఖాన్ని ఇంట్లో ఊదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయమై పోవాలంటే కచ్చితంగా ఇంట్లో శంఖాన్ని ఊదండి. శంఖాన్ని ఊదడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో పెట్టి శంఖంని పూజిస్తే సుఖసంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఎంతో ఆనందం ఉంటుంది. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. ఇలా శంఖం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ఇంట్లో పెట్టి పూజించండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…