Gomatha : హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవుకు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఆవును పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులో దేవతలు, దేవుళ్లు అందరూ నివాసం ఉంటారని హిందువులు నమ్ముతారు. గృహప్రవేశం, పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో కూడా ఆవుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆవును ప్రత్యేకంగా పూజించడం, పరిహారాలు వంటివి చేయడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే గోమాతను ప్రసన్నం ఎలా చేసుకోవాలి.. దాని కోసం మనం చేయాల్సిన పూజలు, పరిహారాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవుకు రొట్టెతో పాటు బెల్లం కూడా తినిపించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాచేయడం వల్ల జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మన పురోగతికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే ఆవు మెడ, వీపును పట్టుకుంటే ఆవు అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే రోజూ అన్నం తినే ముందు మొదటి ముద్దను ఆవుకు పెట్టడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే జాతకంలో బుధుడు అశుభంగా ఉన్నవారు రోజూ ఆవుకు కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది.
అలాగే ఇంట్లో ఉండే పూజ గదిలో ఆవు బొమ్మను ఉంచాలి. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. పూజ గదిలో ఆవుబొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. రోజూ ఆవు బొమ్మను, ఆవును పూజించడం వల్ల పుణ్య లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా జాతక సమస్యలతో బాధపడే వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఆవును పూజించడం వల్ల, తగిన పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…