ఆధ్యాత్మికం

Pratyangira Mantram : ఎవడైనా మీ జోలికి వస్తే ఈ మంత్రం చదవండి.. అంతే.. శత్రువులు నశిస్తారు..

Pratyangira Mantram : మనుషులు తమ జీవితంలో చేసే పనులకు గాను మిత్రులు ఏర్పడుతుంటారు, శత్రువులు తయారవుతుంటారు. మిత్రులు మన మంచి కోరితే శత్రులు మాత్రం మన అంతం కోరతారు. మనల్ని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు చూస్తుంటారు. శత్రువులు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరికి శత్రువులు ఏర్పడుతుంటారు. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే ఇలాంటి బాధలు ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను పఠిస్తూ పరిహారం చేస్తే చాలు.. దాంతో శత్రువులు మిమ్మల్ని చూడాలంటనే భయపడిపోతారు. శత్రువుల బాధ ఉండదు. వారి పీడ వదిలిపోతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శత్రువుల నుంచి రక్షణ పొందడానికి, శత్రు నిర్మూలనకు, శత్రు బాధలు తొలగిపోవడానికి కింది పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మల్లె పువ్వులతో అమావాస్య రోజున కాళికా దేవిని పూజించాలి. దీంతో ఎలాంటి శత్రు బాధలు అయినా సరే పోతాయి. అలాగే శత్రువులు ఇబ్బందులకు గురి చేస్తుంటే.. నాలుగు జీడి గింజలను తీసుకుని భైరవ లేదా ప్రత్యంగిరా మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. అనంతరం ఊరి బయట తుమ్మ చెట్టు మొదట్లో వాటిని పాతి పెట్టాలి. అలా పాతి పెట్టే సమయంలో మీ శత్రువు పేరును 11 సార్లు ఉచ్చరించాలి. దీంతో వారి పీడ వదిలిపోతుంది.

Pratyangira Mantram

ఒక తెల్లని పేపర్‌పై మీ శత్రువు పేరు, అతని తల్లి పేరును బొగ్గుతో రాసి ఊరి బయట శ్మశానంలో పాతి పెట్టాలి. దీంతో శత్రు బాధలు తొలగిపోతాయి. చేతిలో తెల్ల ఆవాలని తీసుకుని 11 సార్లు.. ఉగ్రం వీరం మహా విష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యుర్‌ మృత్యుమ్‌ నమామ్యహం.. అన్న నృసింహ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణలో, నలు మూలల్లో, నాలుగు దిక్కుల్లో చల్లడం వల్ల మీ శత్రువు మిమ్మల్ని బాధించడు. శత్రువు పేరు, తల్లి పేరు భోజ పత్రంపై గంధంతో రాసి తేనె సీసాలో పెట్టి మూత బిగించి పూజ గదిలో పెట్టండి. శత్రువులు నిర్వీర్యులై మీకు హాని చేయకుండా ఉంటారు. శత్రువు పేట్రేగి పోతుంటే మీ ఇంటి బయట మంట పెట్టి ఎండు మిరపకాయలు ఐదు తీసుకుని మీపై నుంచి 5 సార్లు శత్రువు పేరు చెబుతూ తిప్పి ఇంటి బయట కాలుతున్న మంటలో వేయండి. శత్రు పీడ పోతుంది.

కొన్ని తెల్ల ఆవాలను తీసుకుని ఓం భ్రం భైరవాయ నమః అన్న భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది దిక్కులా చల్లండి. మీ శత్రువుల నుంచి భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు. శనివారం మిట్ట మధ్యాహ్నం తన ఎత్తుకు సరిపడా ఎత్తులో ఎర్ర దారాన్ని తీసుకుని కొబ్బరి బొండానికి ఆ దారాన్ని చుట్టి పసుపు కుంకుమతో బొండాన్ని అలంకరించి మూడు సార్లు దిష్టి తీసుకుని ప్రవహించే నదిలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా ఈ తంత్రాన్ని ఏడు సార్లు చేయాలి. ఆర్థిక నష్టాలు, రుణ బాధలు పోతాయి. శత్రు పీడల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులు నశిస్తారు. రోగాలు తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM