Pooja To God : ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు.
ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో కూడా పూజ చేసుకో వచ్చు. దానికి ఏమీ అడ్డు చెప్పలేదు భగవంతుడు. పైగా ఆహార విషయంలో కూడా ఎలాంటి నియమం లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యా వందనం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు.
అయితే కొంత మంది ఓపిక లేని వాళ్ళు, వయసు పైబడిన వారు టిఫిన్ తిని, ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా లేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే ఓపిక లేని వాళ్ళు, సంధ్యావందనం లేనివారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో చాలా మంది పలు సమస్యలతో బాధ పడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండి, ఓపికతో నిలబడలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని భగవంతుడిని ఆరాధించవచ్చు. పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అనుకునేవాళ్ళు పూజ చేయకపోవడం కూడా మంచిదే. ఒకవేళ కనుక ఓపిక లేని వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేసుకుంటేనే భగవంతుడికి ఇష్టం. కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకుని పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ తప్పు లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…