Pooja Room : ప్రతి ఇంట్లో పూజ చేయడం సహజం. అలానే ప్రతి ఇంట నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకి ఒకసారి దేవుని పటాలు శుభ్రం చేయాలి.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఎన్ని రోజులు కి దేవుని పటాలు శుభ్రం చేయాలి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోండి. నెలకి ఒకసారి ఆడవారికి నెలసరి సమయం. ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి, పసుపు నీళ్లు ఇంట్లో చల్లిన తర్వాత దేవుడు పటాలని శుభ్రంగా తుడిచి, గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి.
దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. ఫోటోలని శుభ్రం చేసేటప్పుడు, మొత్తం అన్ని ఫోటోలు తీసేసి, ఆ తర్వాత శుభ్రంగా తుడిచి, ఫోటోలన్నిటికీ బొట్టు పెట్టి తర్వాత మీరు మందిరంలో పెట్టాలి. నెలకి ఒకసారి లేదంటే వారానికి ఒక సరైనా మీరు శుభ్రపరుచుకోవచ్చు.
అలానే ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం కదా.. ఎప్పటి పువ్వులని అప్పుడే తీసేయాలి. ఈరోజు పూజ చేసాక మరుసటి రోజు పూజ చేసేటప్పుడు నిన్నటి పూలని తప్పక తీసేయాలి. పూలు ఎండి పోతే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. చాలామంది పూలు వాడిపోలేదు కదా తాజా గానే ఉన్నాయని వదిలేస్తూ ఉంటారు. అలా చేయకండి. తీసేసిన పూలన్నింటినీ కూడా అందరూ తొక్కేసే చోట అసలు పారేయకూడదు.
ఆ పూలన్నీ పారే నదిలో కానీ పచ్చని మొక్కలు కానీ వేసేయాలి. ఇలా చేయడం వలన చెట్టుకి పోషణ లభిస్తుంది. చూడడానికి అందంగా ఉంటుంది. పాపం కూడా తగలదు. అలానే తోరణాలు ఇంటికి కట్టినప్పుడు అవి ఎండిపోకుండా తీసేయాలి. రెండు మూడు రోజుల్లోనే తీసేయడం మంచిది. శుక్రవారం నాడు తొలగించకూడదు. ముఖ్యమైన పండుగలకు, శుభకార్యాలకి గడపకి కచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…