కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు. పాలు పొంగియటం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు. అంతే కాదు అలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయి. హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో కానీ.. పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనుక ఒక అర్థముంది.
సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భంనుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. ఆయన పాల సముద్రంలో శేషతల్పంపై ఉంటాడు. అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు.
ఇంటి ఆడపడచులకు పెద్దపీట వేస్తారు. వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు. గోవు కామధేనువుకు ప్రతిరూపం. దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం.
చాలా మందికి సొంతిల్లు అనేది ఒక కల. తనకంటూ ఒక ఇల్లు, అందులో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అనుకుంటారు. అందుకే ఇంటి విషయానికి వచ్చే సరికి వాస్తు మొదలు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని.. శాస్త్రాన్ని.. పాటించి తీరుతారు. గృహ ప్రవేశమప్పుడు పాలు పొంగిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం మీద పాలు పొంగిస్తారు. ఆ నమ్మకానికి విలువ ఇచ్చారు అంటే ఇల్లు మీద ఎంత మక్కువ ఉందో చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…