Lord Vishnu : నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు ఉంటాయి..? ఈ ప్రశ్న కి మహావిష్ణువు చెప్పిన సమాధానం ఇది. శ్రీమహావిష్ణువుని ఒక భక్తుడు నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు వుంటాయని అడగగా.. ఆయన ఇలా చెప్పారు. నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడని.. అప్పుడు నారదుడితో ఇలా చెప్తారు. నారద మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దాం. అప్పుడు మహా విష్ణువు, నారద మహర్షులు వారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక పెద్ద భవంతి కనబడింది. వారు అక్కడికి వెళ్తారు. బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణు మూర్తి అడుగుతారు.
ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి ఏంటని అడుగుతారు. మాకు బాగా ఆకలిగా ఉంది. ఏమైనా పెడతారా అని అడుగుతారు. మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా అని ఆ సేటు అడుగుతాడు. పైగా ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్తాడు. నారదుడు శ్రీమహావిష్ణువు చేతుల్ని పట్టుకుని, స్వామిని బయటకు తీసుకువచ్చి, ఆయన ఇంత అవమానించినా మీరు ఎందుకు ఏమీ అనడం లేదు..? అతన్ని శపించండి అని అంటాడు. శ్రీమహావిష్ణువు వెంటనే రెండు చేతుల్ని పైకి ఎత్తి, నీకు ధనం చాలా రావాలి.
నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి. సంపద పెరగాలి అని వరం ఇస్తాడు. మిమ్మల్ని తిట్టి వెళ్లిపోమంటే మీరేంటి ఇలా అంటున్నారు అని నారదుడు అంటారు. దానికి స్వామి పద నారదా మనం వెళ్ళిపోదాం అంటారు. అలా వాళ్ళు ముందుకు వెళ్లగా, అక్కడ ఒక పూరి గుడిసె కనబడింది. అక్కడ ఒక అమ్మ కూర్చుని ఉంటుంది. ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. తినడానికి ఏమీ లేదు కానీ ఒక ఆవు ఉంది. సేవ చేసుకోవడం వలన రోజు నాకు అది పాలిస్తుంది. ఆ పాలు ఉన్నాయి. రండి అని ఆమె కూర్చో పెడుతుంది. ఆకలి తీర్చింది.
అప్పుడు నారదుడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు. ఆవు చనిపోవాలని మహావిష్ణువు అంటారు. అప్పుడు నారదుడు నాకు మీ స్వరూపం నచ్చడం లేదు. అవమానించిన వాళ్ళకి ఏమో మీరు మంచి జరగాలని దీవించారు. ఈమెకేమో ఆవు చనిపోవాలని కోరుకుంటున్నారు అని అంటారు. ఎందుకు ఇలా దీవించారంటే.. ఆమె నిత్యం నన్నే కొలుస్తూ ఉంటుంది పైగా రోజు ఆవుకి సేవ చేస్తుంది.
నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది అని ఆమె బాధ పడి చనిపోతుంది. అందుకే అలా చెప్పానని స్వామి అంటారు. అయితే మరి సేటుకి ఎందుకు ఇలా దీవించారని అడిగితే, అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది. అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వదించాను. డబ్బులు మూటలు మూటలు కట్టీ కట్టీ ఒకరోజు చనిపోతాడు. ఆ డబ్బు యొక్క ధ్యాస లోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే.. డబ్బు మీద ప్రీతితోనే.. ఆ ఆలోచనతోనే చనిపోతాడు. సుఖ లోకాలు కలగవు అని చెప్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…