Lord Hanuman : ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే కచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి అని భావిస్తారు. కలికాలంలో శీఘ్రంగా వరాలను ఇచ్చే స్వామి అని కూడా అంటారు. అయితే ఆయనకి ఇష్టమైన పదార్థాలని, పండ్లని ఆయనకి నైవేద్యంగా పెడితే ఖచ్చితంగా మనం ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. మరి ఇక ఆంజనేయస్వామికి ఇష్టమైన వాటి గురించి చూసేద్దాం..
మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు ఇలా చేస్తే, ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. సమస్యల నుండి గట్టెక్కి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అంటే ఎంతో ఇష్టం. ఆయనకి నిమ్మ, కొబ్బరి, పనస అంటే ఇష్టం. అరటి, మామిడి, నేరేడు కూడా ఇష్టమే. పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పారిజాతములు, మందార పుష్పములు, నందివర్ధనము పూలతో పూజ చేయడం మంచిది.
అలానే మల్లెలు, గన్నేరు వంటి పూలంటే కూడా ఆయనకి మహా ఇష్టం. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములతో కూడా పూజ చేయండి. ఇవి కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. నైవేద్యంగా పాలు, పాయసం, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము పెడితే ఇష్టం.
సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, ఖర్జూరము వంటివి కూడా మహా ఇష్టము. ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. అరటి తోటలంటే కూడా ఆయనకి ఎంతో ఇష్టము. కనుక అక్కడ కూడా పూజించవచ్చు. మంగళవారం, శనివారం స్వామిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…