Lord Hanuman : చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు. హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు, ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి కూడా కలగవు.
హనుమంతుడు ఆకు పూజని బాగా ఇష్టపడతాడు. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యాన్ని కూడా చెబుతాడు. లంకా నగర వాసులకి భయాన్ని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయాన్ని హనుమంతుడు చెప్తాడు. సంతోషంతో రాముడు తమలపాకును తెంపి మాలాగా చేసి, ఆయన మెడలో వేస్తాడు. ఆయనని అభినందిస్తాడు.
అయితే లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి తోకతో తగలబెట్టి వస్తాడు. అందుకని ఆయన శరీరం వేడిగా ఉండడంతో, తాపాన్ని తగ్గించడం కోసమే రాముడు మెడలో తమలపాకు మాలని హనుమంతుడికి వేసినట్టు పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలా హనుమంతుడి మెడలో రాములవారు తమలపాకుల మాల వేయడం వలన హనుమంతుడు ఒక్కసారిగా ఆయన పడిన శ్రమనంతా కూడా మరిచిపోతాడు. ఎంతో సంతోషంతో ఉంటాడు.
ఇలా రాములవారు హనుమంతుడి మెడలో తమలపాకు మాలని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతాడు. కనుక ఆంజనేయస్వామిని సంతోషంగా ఉంచడానికి అప్పటి నుండి కూడా తమలపాకు మాలని వేయడం జరుగుతోంది. తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తాడు. తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్నవి జరుగుతాయని పండితులు అంటున్నారు. అందుకని ప్రత్యేకించి హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా తమలపాకులతో పూజించడం మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…