Lord Hanuman : చాలామంది ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికి పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే హనుమంతుడిని పూజించేటప్పుడు పూలతో కంటే ఆకులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆకు పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు అని పండితులు అంటుంటారు. హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన గండాలు, ఆర్థిక బాధలు వంటివి తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి కూడా కలగవు.
హనుమంతుడు ఆకు పూజని బాగా ఇష్టపడతాడు. హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యాన్ని కూడా చెబుతాడు. లంకా నగర వాసులకి భయాన్ని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయాన్ని హనుమంతుడు చెప్తాడు. సంతోషంతో రాముడు తమలపాకును తెంపి మాలాగా చేసి, ఆయన మెడలో వేస్తాడు. ఆయనని అభినందిస్తాడు.
అయితే లంకా నగరాన్ని ఆంజనేయ స్వామి తోకతో తగలబెట్టి వస్తాడు. అందుకని ఆయన శరీరం వేడిగా ఉండడంతో, తాపాన్ని తగ్గించడం కోసమే రాముడు మెడలో తమలపాకు మాలని హనుమంతుడికి వేసినట్టు పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలా హనుమంతుడి మెడలో రాములవారు తమలపాకుల మాల వేయడం వలన హనుమంతుడు ఒక్కసారిగా ఆయన పడిన శ్రమనంతా కూడా మరిచిపోతాడు. ఎంతో సంతోషంతో ఉంటాడు.
ఇలా రాములవారు హనుమంతుడి మెడలో తమలపాకు మాలని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతాడు. కనుక ఆంజనేయస్వామిని సంతోషంగా ఉంచడానికి అప్పటి నుండి కూడా తమలపాకు మాలని వేయడం జరుగుతోంది. తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇస్తాడు. తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్నవి జరుగుతాయని పండితులు అంటున్నారు. అందుకని ప్రత్యేకించి హనుమంతుడిని తమలపాకులతో పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా తమలపాకులతో పూజించడం మంచిది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…