Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు.
డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకు కారణాలు ఏంటి..?, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడిని ఆది దేవుడిగా భావించి, మనం పూజలు చేస్తూ ఉంటాము. ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు.
మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు. అందుకే, కచ్చితంగా గణపతిని పూజించాలి. శుభకార్యాలు జరపాలన్నా, దేనినైనా మొదలు పెట్టాలన్నా, పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము. లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే, ఆమె సంపదకి అధిపతి. ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు. అయితే, జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది.
వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు. అందుకని, వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది. అడ్డంకులన్నీ తొలగిపోయి, సంపద కలగాలని గణపతిని, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు. పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు. ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని, ముందు వినాయకుడికి పూజ చేయాలని, లక్ష్మీదేవి చెప్తుంది. అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి, వినాయక పూజని మొదలుపెడతాడు. తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు. అలా వినాయకుడిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడం మొదలైంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…