Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు.
డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకు కారణాలు ఏంటి..?, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడిని ఆది దేవుడిగా భావించి, మనం పూజలు చేస్తూ ఉంటాము. ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు.
మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు. అందుకే, కచ్చితంగా గణపతిని పూజించాలి. శుభకార్యాలు జరపాలన్నా, దేనినైనా మొదలు పెట్టాలన్నా, పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము. లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే, ఆమె సంపదకి అధిపతి. ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు. అయితే, జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది.
వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు. అందుకని, వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది. అడ్డంకులన్నీ తొలగిపోయి, సంపద కలగాలని గణపతిని, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు. పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు. ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని, ముందు వినాయకుడికి పూజ చేయాలని, లక్ష్మీదేవి చెప్తుంది. అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి, వినాయక పూజని మొదలుపెడతాడు. తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు. అలా వినాయకుడిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడం మొదలైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…