సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా మనం ఏ కార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గ్రహ దోషాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏ విధమైనటువంటి గ్రహదోషంతో బాధపడే వారు ఎలాంటి వినాయకుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*సూర్య గ్రహదోషంతో బాధపడేవారు ఎర్రచందనంతో తయారు చేసిన గణపతిని పూజించాలి.
*చంద్ర గ్రహదోషంతో బాధపడేవారు తెల్లని పాల రాయితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.
* కుజ గ్రహదోషంతో బాధపడేవారు రాగితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.
* బుధ గ్రహదోషంతో బాధపడేవారు మరకత గణపతిని పూజించాలి.
*గురు గ్రహదోషంతో బాధపడే వారు పసుపుతో తయారుచేసిన వినాయకుడికి పూజ చేయాలి.
*శుక్ర గ్రహదోషంతో బాధపడేవారు స్పటిక వినాయకుడిని పూజించాలి.
*శని గ్రహదోషంతో బాధపడేవారు నల్ల రాతిపై చెక్కిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.
*రాహుగ్రహ దోషం ఉన్నవారు మట్టితో చేసిన గణపతిని, కేతు గ్రహ దోషం ఉన్నవారు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషం పోయి అనుకున్నవి నెరవేరుతాయి. కష్టాలు తప్పుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…