Kamaskhi Temple : మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఉంటారు. ఆ రూపాలలో పూజలు కూడా అందుకుంటారు. అమ్మవారిని నమ్మి, కోరి కొలిచిన భక్తులపై కచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అమ్మవారు కరుణ చూపిస్తారు. అమ్మవారు భక్తులని కాపాడతారు.
కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకుంటే, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్లలేరట. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి, మానవ సంకల్పం చాలదు. తల్లి సంకల్పమే ప్రధానం. సమస్త భూమండలానికి నాభి స్థానం కంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన నాభి నుండే తల్లి పోషిస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకుంటే, కష్టాలు ఏమీ ఉండవు. ఇక్కడ సుగంధ కుండలాంబ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రూపం ఉండదు. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు ఉంటాడు.
అలాగే కామాక్షి ఆలయంలో అరూపా లక్ష్మీ దేవి దర్శనం ఇస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ కుంకుమ ప్రసాదాన్ని అరూపా లక్ష్మి తల్లికి ఇచ్చి ప్రసాదంగా తీసుకుంటే భర్తని నిందించిన దోషమంతా కూడా పోతుంది. స్త్రీ, పురుషులు ఎవరైనా కూడా అరూపా లక్ష్మీ తల్లిని దర్శించుకోవచ్చు. అప్పుడు శాప విమోచనం అవుతుంది.
కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కన ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో తుండిరా మహారాజు వుంటాడు. శివుడికి నంది ఎలాగో అలా అమ్మకి ఎదురుగా ఉంటాడు. కాత్యాయనీ దేవి శివుడిని భర్తగా పొందడానికి, కాంచీపురం క్షేత్రంలో తపస్సు చేస్తుంది. ఇంతటి విశిష్టత ఈ ఆలయానికి ఉంది. ఈ ఆలయానికి వెళితే ఎలాంటి కష్టమైనా సరే పోతుందని భక్తులు విశ్వసిస్తారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…