Kalasha Sthapana : చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఘటస్థాపనతో పాటు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల మొదటి రోజు చేసే కలశ స్థాపనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కలశ స్థాపనకు ఉపయోగించిన కొబ్బరికాయను నవరాత్రి చివరి రోజున తొలగించి భద్రంగా ఉంచుతారు. దీనిని శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ ధర్మాల ప్రకారం కొబ్బరికాయను శ్రీహరి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయ లేకుండా చేసే పూజ అసంపూర్ణమైనది. నవరాత్రుల్లో ఘటస్థాపన చేసే ఎవరైనా కొబ్బరికాయను ఉపయోగించాల్సిందే. అయితే కొన్నిసార్లు మనం కలశంలో ఉంచిన కొబ్బరికాయలో మొక్క పెరుగుతూ ఉంటుంది.
ఇలా మొక్క పెరిగే కొబ్బరికాయ మనకు దేనిని సూచిస్తుంది… ఇది మంచిదా..? కాదా..? ఇది ఎటువంటి ఫలితాలు కలిగిస్తుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో కలశంలో ఉంచిన కొబ్బరికాయలో చెట్టు పెరిగితే దీనిని శుభ సంకేతంగా పరిగణించాలి. అక్కడ ఉండే వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది. కొబ్బరికాయలో పెరిగే ఈ మొక్క మన ప్రగతిని సూచిస్తుంది. హిందూ ధర్మాల ప్రకారం విష్ణువు మరియు లక్ష్మీ దేవి కొబ్బరి చెట్టును భూమిపైకి తీసుకువచ్చారని నమ్ముతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. మనం పూజలో ఉపయోగించిన కొబ్బరికాయలో కనుక చెట్టు ఉంటే మనకు విష్ణువు యొక్క ఆశ్వీరాదం లభించిందని దాని అర్థం.
అలాగే లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయలో నివసిస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ప్రతిష్టించిన కొబ్బరికాయలో చెట్టు ఉంటే మనపై లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉన్నట్టే. అలాగే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడంతో పాటు ఆర్థికస్థితి కూడా మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…