Kalasha Sthapana : చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఘటస్థాపనతో పాటు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల మొదటి రోజు చేసే కలశ స్థాపనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కలశ స్థాపనకు ఉపయోగించిన కొబ్బరికాయను నవరాత్రి చివరి రోజున తొలగించి భద్రంగా ఉంచుతారు. దీనిని శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ ధర్మాల ప్రకారం కొబ్బరికాయను శ్రీహరి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయ లేకుండా చేసే పూజ అసంపూర్ణమైనది. నవరాత్రుల్లో ఘటస్థాపన చేసే ఎవరైనా కొబ్బరికాయను ఉపయోగించాల్సిందే. అయితే కొన్నిసార్లు మనం కలశంలో ఉంచిన కొబ్బరికాయలో మొక్క పెరుగుతూ ఉంటుంది.
ఇలా మొక్క పెరిగే కొబ్బరికాయ మనకు దేనిని సూచిస్తుంది… ఇది మంచిదా..? కాదా..? ఇది ఎటువంటి ఫలితాలు కలిగిస్తుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో కలశంలో ఉంచిన కొబ్బరికాయలో చెట్టు పెరిగితే దీనిని శుభ సంకేతంగా పరిగణించాలి. అక్కడ ఉండే వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది. కొబ్బరికాయలో పెరిగే ఈ మొక్క మన ప్రగతిని సూచిస్తుంది. హిందూ ధర్మాల ప్రకారం విష్ణువు మరియు లక్ష్మీ దేవి కొబ్బరి చెట్టును భూమిపైకి తీసుకువచ్చారని నమ్ముతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. మనం పూజలో ఉపయోగించిన కొబ్బరికాయలో కనుక చెట్టు ఉంటే మనకు విష్ణువు యొక్క ఆశ్వీరాదం లభించిందని దాని అర్థం.
అలాగే లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయలో నివసిస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ప్రతిష్టించిన కొబ్బరికాయలో చెట్టు ఉంటే మనపై లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉన్నట్టే. అలాగే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడంతో పాటు ఆర్థికస్థితి కూడా మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…