సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము. అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయకుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి.
శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం తెల్ల జిల్లేడు చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ తెల్లజిల్లేడు చెట్టును శ్వేతార్కమూల గణపతిగా భావించి పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు. మరి ఈ గణపతి ని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే..
ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు తెల్లజిల్లేడు చెట్టు మొదలును సేకరించడం అత్యంత శ్రేష్టం. ఆరోజు ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి మట్టిలో నుంచి శ్వేతార్కమూలం సేకరించి, మూలాన్ని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రం పై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మరికొందరు ఈ జిల్లేడు కొమ్మపై వినాయకుడి ప్రతిమలు చేయించుకుని పూజలు చేస్తుంటారు. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…