Hindu Gods : హిందువుల్లో చాలా మంది వారంలో నిర్దిష్టమైన రోజుల్లో మాంసాహారం తినరు. కొందరు సోమవారం మాంసాహారం తినడం మానేస్తే, కొందరు మంగళవారం తినరు. కొందరు గురువారం, ఇంకా కొందరు శనివారం మాంసాహారం తినరు. తాము ఆ రోజున తమ ఇష్టదైవానికి మొక్కుకున్నామని, కనుకనే ఆయా రోజుల్లో మాంసాహారం తినలేమని కొందరు చెబుతారు. అయితే నిజానికి ఈ రోజుల్లో అసలు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..? అందుకు ఉన్న పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని హిందువులు పూజిస్తారు. ఆ లెక్కన చూసుకుంటే ఆదివారం రామున్ని, సోమవారం శివుడు, గణేషున్ని, మంగళవారం హనుమంతున్ని, దుర్గాదేవిని, బుధవారం విష్ణువు, అయ్యప్ప స్వామిని, గురువారం సాయిబాబా, విష్ణువును, శుక్రవారం మహాలక్ష్మి, పార్వతి, దుర్గా దేవిని, శనివారం వెంకటేశ్వర స్వామి, హనుమంతున్ని భక్తులు పూజిస్తారు. అయితే వారంలో సోమ, మంగళ, గురు, శని వారాల్లో మాత్రం చాలా మంది నాన్ వెజ్ తినరు. ఇలా ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు బ్రాహ్మణులంతా కలసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. జనాలు ఎక్కువగా మాంసాహారానికి అలవాటు పడిపోయారని, అది హానికరమని భావిస్తూ అందరూ కచ్చితంగా శాకాహారం మాత్రమే తినాలని తీర్మానించారు. కానీ దీనికి చాలా మంది ఒప్పుకోలేదట. అయితే కనీసం సోమ, మంగళ, గురు, శని వారాల్లో అయినా మాంసాహారం మానేయమని, అలా చేస్తే ఆ రోజుల్లో పూజించే దైవాల అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. దీంతో ఆ రోజుల్లో నాన్వెజ్ తినడం మానేశారు జనాలు. ఇక దీనికి ఉన్న ఇంకో కారణం ఏమిటంటే..
మాంసాహారం తామస ఆహారం. అంటే ఒంట్లో కామాన్ని, కోరికలను పెంచుతుంది. దీంతో మనుషులు వాటి బారిన పడి ఉచ్చ నీచాలను మరిచిపోతారు. చేయకూడని పనులు చేస్తారు. వ్యక్తిగత నియంత్రణ ఉండదు. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు, సెల్ఫ్ కంట్రోల్ కోసం జనాలు ఆయా రోజుల్లో నాన్ వెజ్ తినడం మానేశారు. నాన్ వెజ్ తినరు కాబట్టి దైవాన్ని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని నమ్మారు. కనుకనే ఆ రోజుల్లో చాలా మంది నాన్ వెజ్ను తినడం మానేశారు. అదేవిధంగా ఈ అంశం వెనుక ఉన్న మరో కారణాన్ని పరిశీలిస్తే..
అప్పట్లో పురాణాల ప్రకారం దేవతలు తమకిష్టమైన దేవుళ్లు, దేవతలను అడిగారట. వారికిష్టమైన రోజు వారంలో ఏది అని. దీంతో దేవుళ్లు, దేవతలు తమ కిష్టమైన రోజులుగా పైన చెప్పిన ఆ రోజులను చెప్పారట. దీంతో అప్పటి నుంచి ఆ రోజుల్లో మాత్రం మాంసాహారం తినడం మానేసి దైవ పూజ చేస్తూ వస్తున్నారు. ఇవీ.. ఆ విషయం వెనుక ఉన్న అసలు కారణాలు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…