మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు, భక్త ఆంజనేయుడు, వరాల ఆంజనేయుడు, వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే.. మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ స్వామివారు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
పురాణాల ప్రకారం సీతాపహరణ జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి చేసిన సహాయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే సీతాన్వేషణ కార్యక్రమంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే లక్ష్మణుడిని బ్రతికించడం కోసం మృతసంజీవని కావాల్సి వస్తే ఆంజనేయస్వామి మృతసంజీవని కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడనే విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా మృత సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే సమయంలో హనుమంతుడు అలసిపోయి ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరాడని ఆలయ పురాణం చెబుతోంది. ఈ క్రమంలోనే అది చూసిన ఓ భక్తుడు స్వామి వారి పాదాలను పట్టుకుని అక్కడి ప్రజల కష్టాలను తీర్చడం కోసం స్వామివారు ఇక్కడ కొలువై ఉండాలని అనడంతో అందుకు స్వామివారు ఆ ప్రాంతంలో భక్తులకు తాను శయన స్థితిలో భద్ర మారుతిగా దర్శనమిస్తానని చెప్పారు. ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తున్నారు.
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…