మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు, భక్త ఆంజనేయుడు, వరాల ఆంజనేయుడు, వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే.. మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ స్వామివారు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
పురాణాల ప్రకారం సీతాపహరణ జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి చేసిన సహాయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే సీతాన్వేషణ కార్యక్రమంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే లక్ష్మణుడిని బ్రతికించడం కోసం మృతసంజీవని కావాల్సి వస్తే ఆంజనేయస్వామి మృతసంజీవని కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడనే విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా మృత సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే సమయంలో హనుమంతుడు అలసిపోయి ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరాడని ఆలయ పురాణం చెబుతోంది. ఈ క్రమంలోనే అది చూసిన ఓ భక్తుడు స్వామి వారి పాదాలను పట్టుకుని అక్కడి ప్రజల కష్టాలను తీర్చడం కోసం స్వామివారు ఇక్కడ కొలువై ఉండాలని అనడంతో అందుకు స్వామివారు ఆ ప్రాంతంలో భక్తులకు తాను శయన స్థితిలో భద్ర మారుతిగా దర్శనమిస్తానని చెప్పారు. ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తున్నారు.
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…