Durga Devi : చాలామంది ప్రతి రోజూ లలితా సహస్రనామాలను చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గురించి ఉన్నాయి. మరి వాటిని తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీతమానస అని ఉంటుంది. గుడ అంటే బెల్లం. అన్నం అంటే బియ్యాన్ని వండడం. బియ్యం, బెల్లంతో చేసే వంటకం. పరమాన్నం అన్నమాట. అమ్మవారికి ఇది ఎంతో ఇష్టం.
స్నిగ్దౌదన ప్రియా.. స్నిగ్ద అంటే తెలుపు. ఓదనము అంటే అన్నము. అంటే పసుపు కలిపినది. తెల్లని అన్నం అన్నమాట. తెల్లగా ఉంటుంది కనుక కొబ్బరి అన్నం కూడా కావచ్చు. దీన్ని తయారు చేసి కూడా అమ్మవారికి పెట్టొచ్చు. పాయసాన్నప్రియ.. పాలు, బియ్యంతో చేసే ఒక వంటకం అన్నమాట. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. మధుప్రీతా అంటే.. మధు అంటే తేనె, ప్రీత అంటే ఇష్టమైనది. తేనెతో చేసిన పదార్థాలని మనం చెప్పచ్చు. తేనె గారెలు అంటే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.
దద్ధ్యన్నాసక్తి హృదయా.. పెరుగు అన్నం. దద్దోజనం. సర్వోదనప్రీతచిత్తా అంటే కదంబం. దీనిని కాయగూరలు, బియ్యంతో చేస్తారు. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. హరిద్రానైక రసిక.. హరిద్రము అంటే పసుపు. అలానే అన్నం. మన పరిభాషలో పులిహోర. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.
ముగ్దౌదనాసక్త హృదయ.. అంటే పెసలతో చేసిన అన్నం. ఆసక్తి అంటే అభిరుచి కలిగిన. హృదయము అంటే మనసు కలిగినది. పెసలతో వండిన అన్నం. పులగమని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే వీటిని నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజించి, తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వంటకాలని నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే ఇలా లలితా సహస్రంలో నైవేద్యం గురించి ఉన్నట్లు చాలామందికి తెలియదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…