Durga Devi : మనం ఏ పూజ చేయాలన్నా కచ్చితంగా పూలు మనకి ఉండాలి. ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి. రోజూ దేవుడికి పూజ చేయాలన్నా, పండగలప్పుడైనా సరే కచ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం. పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం. అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం. అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు ఈ పూలని పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అయితే దుర్గాదేవిని మామూలు సమయంలో ఆరాధించేటప్పుడు ఈ పూలను పెట్టవచ్చు. అలాగే నవరాత్రి వేళల్లో కూడా ఈ పూలని పెట్టడం మంచిది. అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం. మందార పూలని అమ్మవారికి పెడితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మందారం పూలతో పూజించాలని పండితులు అంటున్నారు. మందార పూలతోపాటు ఆ దేవతకి నెయ్యిని కూడా అర్పించవచ్చు.
అలాగే అమ్మవారికి చామంతి పూలు అంటే కూడా ఇష్టం. చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి. అమ్మవారిని కమలం పూలతో పూజ చేస్తే కూడా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో మూడవ రోజు కమలం పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తే మంచిది.
మల్లెపూలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. నవరాత్రుల్లో నాలుగో రోజు మల్లెపూలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఐదవ రోజు పసుపు గులాబీలతో ఆరాధించాలి. ఆరవ రోజు బంతిపూలతో, ఏడవ రోజు కృష్ణ కమలంతో, ఎనిమిదవ రోజు బొండు మల్లె పూలతో పూజిస్తే మంచిది. తొమ్మిదవ రోజు సంపంగి పూలతో పూజ చేయాలి. అయితే నవరాత్రి సమయంలోనే కాకుండా మామూలు సమయంలోనూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ పూలని అమ్మవారికి పెట్టి ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. అంతా మంచే జరుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…