Pasupu Gavvalu : చిన్నతనంలో చాలా మంది అష్టాచెమ్మా, పచ్చీస్ వంటివి ఆడి ఉంటారు. ఇప్పటికీ పలు చోట్ల వీటిని ఆడుతూనే ఉంటారు. అయితే వీటిని ఆడేందుకు చాలా మంది గవ్వలను ఉపయోగిస్తారు. మొత్తం ఏడు గవ్వలను అందుకు వాడుతారు. అయితే వాస్తవానికి గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో పసుపు రంగు గవ్వలు కూడా ఒకటి. వీటికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో కింద చెప్పిన విధంగా పలు పరిహారాలను చేస్తే చాలు.. దాంతో ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయట పడతారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని గవ్వలను వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటల్లో ఉపయోగిస్తారు. అయితే పసుపు రంగు గవ్వలు మనకు ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడతాయి. వీటితో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగిపోతుంది. ఈ గవ్వలు కాస్త చిన్నగా ఉంటాయి. సులభంగా గుర్తు పట్టవచ్చు. లేత పసుపు రంగులో మనకు దర్శనమిస్తాయి. ఈ గవ్వలను పూజ మందిరంలో ఉంచి పూజలు చేయడం, ధూపదీపాలను సమర్పించడం చేస్తే జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎలాంటి పూజల్లో అయినా సరే ఈ పసుపు గవ్వలను ఉపయోగించవచ్చు. కానీ బేసి సంఖ్యలో ఉపయోగించాలి. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. కార్యసిద్ధి జరుగుతుంది. అన్నింటా విజయం సాధించారు. డబ్బు బాగా సంపాదిస్తారు. అలాగే 11 పసుపు రంగు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి శుక్రవారం రోజు పూజించి ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అప్పులు తీరిపోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇలా పసుపు రంగు గవ్వలతో మనం ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…