ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితం బాగుండాలని, లేవగానే రోజంతా కూడా బాగుండాలని, మంచి పనులపై దృష్టి పెట్టి, అనుకున్న పనులు పూర్తి చేయాలని అనుకుంటారు. నిద్ర లేవగానే మీరు ఇలా కనుక చేశారంటే, మీ జీవితం మారిపోతుంది. మరి ఇక నిద్ర లేవగానే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరవకుండా.. రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తర్వాత అరచేతుల్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ.. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం.. అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతుల్ని చూసుకోవాలి.
ఇలా దీనిని చదువుకుంటూ మంచం నుండి దిగిన తర్వాత ఒకసారి భూమికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అంతా మంచి జరుగుతుంది. భూదేవిని నమస్కారం చేసుకుంటున్నప్పుడు.. సముద్రవసనే దేవి పర్వతస్థానమణ్డలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.. అని చదువుకోవాలి. స్నానం చేసే ముందు కూడా మనం ఒక మంత్రాన్ని చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.. అని ఈ మంత్రాన్ని చదవాలి. స్నానం చేసే నీటిలోకి నదులన్నీ వచ్చి చేరినట్లుగా భావించాలి. నీటి రూపంలో కూడా భగవంతుడే ఉండి మన దేహాన్ని శుద్ధి చేస్తున్నాడని ఒకసారి స్మరించుకోవాలి.
ఉపనయనం అయిన వాళ్ళు సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం ఇచ్చి యజ్ఞోపవీతాన్ని చేతితో పట్టుకుని దశ గాయత్రిని జపించాలి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.. అని చదువుకోవాలి. అన్నం తినేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది.
అన్నం తినే ముందు రోజూ..బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర.. ఇలా ఈ శ్లోకాన్ని చదువుకుని అన్నం తింటే ఎంతో మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…