Coconut Offering To God : ఇంట్లో ఏదైనా పూజ చేసినా, లేదంటే ఆలయాలకి వెళ్ళినా, కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. అలానే, ఏదైనా శుభకార్యాలప్పుడు కూడా, కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. అయితే. మహిళలు పూజలు చేస్తున్నప్పుడు దేవాలయంలో కొబ్బరికాయల్ని కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే, పూజా కార్యక్రమాల్లో, దేవాలయాల్లో ఎందుకు మహిళలు కొబ్బరికాయని కొట్టకూడదు..? దీని వెనుక కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. శుభకార్యాలప్పుడు కచ్చితంగా కొబ్బరికాయని కొడతారు.
కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తారు. అయితే, భార్య భర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు ఎక్కువగా భర్తలు అంటే పురుషులు, కొబ్బరికాయని కొడుతూ ఉంటారు. స్త్రీలు తక్కువగా కొడుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు చంద్రుని చిహ్నంగా ఉంటుంది. దాన్ని దేవుడికి సమర్పించడం వలన సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. బాధలు, దుఃఖం వంటివి తొలగిపోతాయి. హిందూమతంలో మహిళలు కొబ్బరికాయల్ని కొట్టడం నిషేధించబడింది. అందుకు కారణం ఇది ఒక విత్తనం. స్త్రీలు సంతానానికి కారకులు.
వాళ్ళు ఒకే విత్తనం నుండి సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే, స్త్రీలు ఎప్పుడు కొబ్బరికాయని కొట్టరు. మహిళల కొబ్బరికాయల్ని కొట్టడం వలన, పిల్లల జీవితాలు లో అనేక సమస్యలు వస్తాయని అంటారు. విష్ణువు తల్లి లక్ష్మీ భూమిపై కొబ్బరి చెట్లని నాటినట్లు చెప్పడం జరుగుతుంది. కొబ్బరికాయ విష్ణువు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకనే పూజా విధానంలో కొబ్బరికాయని ఉపయోగిస్తారు. చాలామంది మహిళలు అసలు కొబ్బరికాయని కొట్టారు.
అరుదుగా మాత్రమే మహిళలు కొబ్బరికాయని కొడుతుంటారు. పైగా, కొబ్బరికాయని కొట్టడానికి కొంచెం శక్తి కావాలి. పురుషులు శక్తివంతులు అని కొబ్బరికాయని అప్పట్లో పురుషులు మాత్రమే కొట్టేవారు. ఇప్పుడు అందరూ సమానం అని అంటున్నారు. అందుకే, మహిళలు కూడా కొబ్బరికాయల్ని కొడుతున్నారు. అయితే, మహిళలు కొబ్బరికాయని కొట్టకూడదు అని ఎక్కడ చెప్పలేదు. పైగా మహిళలు కొబ్బరికాయని కొట్టడానికి తప్పుగా కూడా పరిగణించరు. స్త్రీలు కూడా కొబ్బరికాయని కొట్టడానికి అనుమతిస్తూ ఉంటారు. ఒకప్పుడు మాత్రం స్త్రీలని కొబ్బరికాయ కొట్టొద్దు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ కూడా లేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…