Work From Home Scam : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత తరుణంలో ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే దీన్ని ఆసరగా చేసుకుని చాలా మంది నెటిజన్లను మోసం చేస్తున్నారు. సింపుల్ టాస్కులను చేస్తే చాలు.. డబ్బులు వస్తాయని చెప్పి నమ్మిస్తున్నారు. లక్షల రూపాయలను ఇంట్లో కూర్చునే సంపాదించవచ్చని ఆశ పుట్టిస్తున్నారు. ఇది నిజమే అని నమ్మిన చాలా మంది ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ కొందరు ఇంకా ఇలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను నష్టపోతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముంబైకి చెందిన 37 ఏళ్ల ఓ మహిళ గర్భం ధరించి మెటర్నిటీ లీవ్లో ఉంది. ఆమె అక్కడి నవీ ముంబైలోని ఐరోలి అనే ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే లీవ్లో ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది. ఈ క్రమంలోనే ఆమె మాయగాళ్ల ట్రాప్లో పడింది. ఆమె కొందరిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయింది. సింపుల్ టాస్కులను చేస్తే చాలు లక్షల రూపాయలు ఇస్తామని వారు నమ్మబలికారు. దీంతో ఆమె నిజమే అని నమ్మి పలు దఫాలుగా వారి అకౌంట్లలో మొత్తం రూ.54 లక్షలను జమ చేసింది. మొత్తం నలుగురికి చెందిన అకౌంట్లకు ఆమె నగదును ట్రాన్స్ఫర్ చేసింది.
ఆమె నగదు జమ చేశాక అవతలి వ్యక్తులు కొన్ని రోజుల పాటు పలు టాస్కులను ఇచ్చారు. రెస్టారెంట్లకు రేటింగ్స్ ఇస్తే భారీ ఎత్తున డబ్బు సంపాదించవచ్చని చెప్పారు. దీంతో ఆమె వారు చెప్పిన టాస్కులను పూర్తి చేసింది. అయితే చివరకు వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు సదరు నలుగురు అపరిచిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న టాస్కులను చేస్తే లక్షల రూపాయలను సంపాదించవచ్చని ఎవరైనా చెబితే అసలు నమ్మవద్దని వారు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…