ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే కులాలు వేరుగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకుంటే పెద్దలు పరువు హత్య అంటూ వారిని హత్య చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి పరువు హత్య తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతో ఆ పెళ్లైన జంటకు దారుణంగా ముక్కు, చెవిలలో విషాన్ని నింపి చంపేశారు. ఈ
ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్త గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కుప్పందత్త గ్రామానికి చెందిన మురుగేశన్ అనే యువకుడు ఇంజనీరింగ్ చదివాడు. అతడు అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలపగా పెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిని చంపేస్తామని బెదిరించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అందరు పెద్దలు మాదిరిగానే వీరు తమ పెళ్లి అంగీకరిస్తారని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వేరే చోట నివాసం ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి, అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు వారికి మాయమాటలు చెప్పి వారికి ఘనంగా పెళ్లి చేస్తామని నమ్మించి వారి వెంట తీసుకు వచ్చారు. అయితే వారు ఊరికి కాకుండా శ్మ శానం వైపు తీసుకెళ్లడంతో వారిని చంపబోతున్నారని పసిగట్టిన ఆ జంట పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన కుటుంబ పెద్దలు వారి వెంట తీసుకు వచ్చిన విషాన్ని ఆ జంట ముక్కులలో నుంచి శరీరంలోకి ఎక్కించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ మరణించారని తెలుసుకున్న తర్వాత శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తెలిసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 12 మందిని కస్టడీలోకి తీసుకుని ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…