స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటితో ప్రజలు ఎక్కువ సమయం పాటు కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు ఎక్కువగా విహరిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్లు చేస్తున్నారు. యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో అది విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. వనపర్తి జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్,హేమంత్ ఉన్నారు. కాగా కూతురు గత ఏడాది 10వ తరగతి పాసై ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె ఫోన్లో మాట్లాడుతుండడం, ఎస్ఎంఎస్లు పంపడాన్ని ఆమె పెద్ద తమ్ముడు చూశాడు.
దీంతో అతను వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి ఆమెను మందలించాడు. అలా మాట్లాడడం, సందేశాలు పంపడం సరికాదని, అలాంటివి మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో భువనేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలోనే ఆమె మార్గ మధ్యలో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి ఆ కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…