రహదారులపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు దురదృష్టవశాత్తూ ప్రమాదాల బారిన పడుతుంటాం. మన ప్రమేయం లేకుండానే జరిగే ప్రమాదాల్లో మనం చిక్కుకుంటుంటాం. ఆ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాగే జరిగిందని చెప్పవచ్చు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కేరళలోని త్రిసూర్కు చెందిన 34 ఏళ్ల ప్రమోష్ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంపై తన భార్యను త్రిసూర్ రైల్వే స్టేషన్లో దింపేందుకు వెళ్తున్నాడు. వాహనాన్ని అతను నడిపిస్తుండగా వెనుక అతని భార్య కూర్చుంది. మార్గమధ్యలో అయ్యంతోల్ అనే ప్రాంతం వద్దకు రాగానే ఒక్కసారిగా ఓ నెమలి రహదారిపై ఎగురుతూ వచ్చి అతన్ని డీకొట్టింది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పింది.
నెమలి ఢీకొట్టే సరికి అదుపు తప్పిన వాహనం రోడ్డుపై స్కిడ్ అయింది. దీంతో ప్రమోష్, అతని భార్య రోడ్డుపై పడిపోయాడు. తీవ్రగాయాలకు గురైన ఆ ఇద్దరినీ హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని భార్య చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో నెమలి కూడా చనిపోగా దాని మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో ఉన్న పొలాల్లోంచి ఆ నెమలి రోడ్డు మీదకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…