హైదరాబాద్లోని హయత్ నగర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మృతదేహాన్ని భర్త ఒక దుప్పట్లో చుట్టి సమీపంలో ఉన్న బాతుల చెరువు అలుగు వద్ద పడేయటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హయత్నగర్ పాత రోడ్డుకు సమీపాన హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీను, అతని స్నేహితుడు వినోద్ కలిసి తన భార్య లక్ష్మి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సమీపంలోని చెరువు వద్ద పడవేయడాన్ని స్థానికులు గమనించారు.
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అక్కడ పడేయటానికి కారణం ఏంటని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతుందని, అనారోగ్యం కారణంగానే తన భార్య మృతి చెందడంతో దహన సంస్కారాలు నిర్వహించడానికి డబ్బులు లేక ఇలా చేశానని చెప్పాడు. అయితే పోలీసులు అతని ఇంటిని పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అనారోగ్యం కారణంగానే మృతి చెందిందా లేక మరేదైనా జరిగిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…